NRPT: కృష్ణ మండలంలోని చేగుంట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. కలెక్టర్, డీఈవో, ఎంఈవో పాత్రల్లో విద్యార్థులు పాఠశాలను సందర్శించి పరిశీలించడం ఆకట్టుకుంది. కలెక్టర్గా సన్నిధి, డీఈవోగా శివప్రసాద్, ఎంఈవోగా నిరజా బాధ్యతలు నిర్వర్తించారు.