SRD: సిర్గాపూర్ మండలంలోని పోచాపూర్ గ్రామంలో దుర్గా భవాని మాత జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం స్థానిక కాశీ విశ్వనాథ మందిరం నుంచి రథోత్సవం మొదలైంది. అంతకుముందు గ్రామస్తులు ఆచార సాంప్రదాయం ప్రకారంగా రథం ఎదుట నైవేద్యం భక్షాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. తొలుత గ్రామ పెద్దలు రథాన్ని లాగి శోభయాత్ర చేపట్టారు