SKLM: శాలిహుండం గ్రామానికి చెందిన చింతల మోహన కృష్ణ నవోదయ ప్రవేశ పరీక్షల్లో 87.5 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. శాంతినికేతన్ స్కూల్లో చదువుతున్న మోహనకృష్ణ ఎచ్చెర్ల మండలం కేశవరావు పేట గ్రామంలో శిక్షణ తీసుకుని విజయం సాధించాడు. తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, తదితరులు అభినందనలు తెలిపారు.