KRNL: ఆదోని-ఆస్పరి రోడ్డు గుంతలమయమై ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసినా.. సంబంధిత అధికారులు కేవలం గరుసు పోసి కాలక్షేపం చేస్తున్నారని వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారుల్లో చలనం లేదని, ఆదోని MLA పార్థసారథి వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.