RR: యాసంగి పంట సాగుకు యూరియా బస్తాల పంపిణీ ఇవాళ ఉంటుందని కందుకూరు వ్యవసాయ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కందుకూరు మండల కేంద్రంలోని సొసైటీ ఆఫీస్ వద్ద యూరియా బస్తాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటలకు రైతులు యూరియా (ఫెర్టిలైజర్) ఆప్లో బుక్ చేసుకుని తర్వాత తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకుని జిరాక్స్ పత్రాలతో రావాలని సూచించారు.