AKP: నక్కపల్లిలో ఈనెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. బహిరంగ సభ ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.