T20 WC విజయం తర్వాత శివమ్ దూబే రైలులో ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. దీని గురించి అదే పనిగా వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందిస్తూ.. ‘ట్రైన్ జర్నీ చేయడం గొప్ప విషయమా? నేనూ చాలా సార్లు చేశా. ఇతరులతో కలిసి అంతర్జాతీయ క్రికెటర్లు టీ తాగుతూ మమేకం కావడం ఎంత బాగుంటుంది? ఇలాంటి చిన్నచిన్న విషయాల్లోనే ఆనందం ఉంటుందని మర్చిపోతున్నాం’ అని అన్నాడు.