KNR: జవహర్ నవోదయ విద్యాలయం ఎంట్రన్స్ పరీక్షలో సీటు సాధించిన చొప్పదండికి చెందిన పురెళ్ల సహస్రను కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందించారు. గురువారం తమ నివాసంలో కలిసిన సహస్రకు వారు శుభాకాంక్షలు తెలిపారు. నిర్థిష్ట లక్ష్యం, క్రమశిక్షణతో చదువుతూ భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీస్సులు అందచేశారు. ఇందులో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.