SRD: జహీరాబాద్ పట్టణం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పంచాంగ శ్రవణం జరిగింది. సంఘం అధ్యక్షులు గడ్డం జనార్దన్ పూజ కార్యక్రమం చేయగా స్థానిక పండితులు వేణు పంతులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాశుల వారీగా ఆదాయ వ్యయాలను వివరిస్తూ సందేహాలను నివృత్తి చేశారు. సంవత్సర ఆరంభంలో ధరల పెరుగుదల ఉన్నప్పటికీ మధ్య కాలంలో ఊరట కలిగిస్తుందని పేర్కొన్నారు.