కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులతో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక పాలన అధికారి బాలాజీ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల మార్చి మాసంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ వారికి సంబంధించిన పన్నులను చెల్లించి, మచిలీపట్నం నగర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.