GNTR: గుంటూరు నగరంలోని నందివెలుగు, కాకాని రోడ్లపై పోలీసులు గురువారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 922 మంది వాహనదారులకు రూ.5.36 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. హెల్మెట్, సీటు బెల్ట్, లైసెన్స్ వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.