సత్యసాయి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పంచాంగ శ్రవణం ఘనంగా సాగింది. వేద మంత్రోచ్చారణల మధ్య జ్యోతిష్య పండితులు నూతన సంవత్సర రాశిఫలాలు, ఆదాయ వ్యయాల వివరాలను భక్తులకు వివరించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.