పార్వతీపురంలో 24 గంటలు షాపులు తెరిచి ఉంచే జీవో నంబరు-5ని రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ జీవో కార్మిక హక్కులకు విరుద్ధమని పేర్కొంది. గురువారం సుందరయ్య భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్మికులపై పని భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు.