WNP: గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొన్నారు. కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో, రైతన్నల ఇంట పాడిపంటలతో, అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందుండాలని కోరుకున్నట్లు తెలిపారు.