NDL: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీశైలంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా గురువారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో దేవస్థానం అలంకార మండపంలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే, ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.