కృష్ణా: గుడివాడ బీసీ సెల్ అధ్యక్షుడు దారం నరసింహారావు మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమణి విద్యార్థులకు సైకిళ్ళు, మహిళలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలను గురువారం పంపిణీ చేశారు. గుడివాడలో బీసీలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలనే సంకల్పంతో కృషి చేసిన దారం నరసింహారావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని నాగమణి తెలిపారు.