GNTR: విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో తెనాలికి చెందిన ప్రముఖులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా సత్కరించారు. శిల్పి కాటూరి రవిచంద్ర, సాహితీవేత్త సాయి లక్కరాజు, కవి అయినాల మల్లేశ్వరరావు సీఎం చేతుల మీదుగా ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఆయా రంగాల్లో వారు చేస్తున్న విశేష సేవలను అభినందించిన ముఖ్యమంత్రి, వారికి తెలుగుతల్లి ప్రతిమలను అందజేశారు.