W.G: 35 ఏళ్లుగా చిత్రకళలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారం తణుకునకు చెందిన ప్రముఖ చిత్రకారుడు వెంపటాపు వెంకట సత్యనారాయణ అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని గురువారం అందుకున్నారు. ఈయన రాష్ట్ర జాతీయ, అంతర్జాతీయంగా 200 పైగా అవార్డులను అందుకున్నారు.