పార్వతీపురం మండలం, డోకిశీల పంచాయతీ ప్రజలను హనుమంతుడిలా కాపాడుతానని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. డోకిశీల పంచాయతీ తేలునాయుడువలస నుంచి గంజిగడ్డ వరకు తలపెట్టిన బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే స్వయంగా జెసిబి నడిపి పనులు ప్రారంభించారు.