నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. సరైన యూ-టర్న్ లేకపోవడంతో వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్తున్నారని, అందుకే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.