TPT: గూడూరు పట్టణంలోని నెల్లటూరు కట్ట కింద గిరిజన కాలనీలో పేదలకు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ పండగ పురస్కరించుకుని దాతలు షేక్ బాషా, బషీర దంపతులు, వారి కుమార్తె షేక్ పర్వీన్ సహకారంతో సుమారు 50 కుటుంబాలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.