SRCL: కోనరావుపేట మండలంలోని నాగారం ప్రభుత్వ పాఠశాల సుద్దాల రుసివాని విద్యానికేతన్ విద్యార్థులు నవోదయ పాఠశాలకు ఎంపికయ్యారు. సుద్దాల పాఠశాలకు చెందిన మంగళగిరి జయ కేశవ్, పేనుగంటి మను శ్రీ, ఎర్రబెల్లి చైత్ర, నాగారం పాఠశాల చెందిన మేండే దివ్యలు ఎంపిక కాగా డీఈవో జగన్మోహన్ రెడ్డి, ఎంఈవో మురళి నాయక్, కరస్పాండెంట్ దాసు, హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.