ELR: నిలిపి ఉన్న లారీని బైక్ వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పి. గన్నవరానికి చెందిన మోతా అనంద సాత్రి పిప్పరలో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి పిప్పర నుంచి అత్తిలి వెళ్తుండగా, మార్గమధ్యంలోని జి.ఎస్.ఆర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆయన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆనంద సాత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని ఎస్ఐ ఆకుల మణికుమార్ తెలిపారు.