సత్యసాయి: రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు హిందూపురం రూరల్ సీఐ కె.జనార్ధన్ పేర్కొన్నారు. బుధవారం చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను NHAI అధికారులతో కలిసి ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పరిశీలించారు. ఈ కార్యక్రమంలో SI మునీర్ అహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.