JN: వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎంపీ కడియం కావ్య ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే రోజు అని, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంట సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం నిండాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ ప్రతి కుటుంబంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని ఎంపీ ఆకాంక్షించారు.