ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో నివసిస్తున్న హోంగార్డు లక్ష్మి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్ లక్ష్మీ ఇంటికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తక్షణ సహాయం కింద కుటుంబ సభ్యులకు రూ. 10 వేలు అందజేశారు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.