W.G: ఉండి మండల చెరుకువాడ గ్రామం 13 నెంబర్ పంట బోధి తవ్వకం పనులను ఉండి DC కమిటీ వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చిరాజు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టినట్టు తెలిపారు. మండల క్లస్టర్ ఇంచార్జ్ యర్రంకి బుజ్జి, గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబ శివరావు పాల్గొన్నారు.