HNK: భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండాగ్రామంలో వరి పొలాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు డా.గోన్యానాయక్, డా.పద్మజలు బుధవారం పరిశీలించారు. పరిశీలనలో భాగంగా వరి పంటలో కంకినల్లి సమస్య కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతరం రైతులకు సూచనలు చేశారు. HNK డివిజన్ ADA ఆదిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి పద్మ, తదితరులున్నారు.