RR: కొందుర్గు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపు పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఉదయం 6 గంటలకు స్వామివారికి విశేష అభిషేకం, సాయంత్రం 4 గంటలకు పల్లకి సేవ, రాత్రి 7 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది.