NZB: బీసీలకు రానున్న బడ్జెట్లో రూ.50 వేల కోట్లు కేటాయించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్లో R&B గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ను ప్రవేశపెట్టాలని, బీసీ చట్టం తీసుకురావాలని కోరారు.