TPT: పెళ్లకూరు(M) కలవకూరు ఇసుక రీచ్ వద్ద ఈ నెల 14న జరిగిన ఘటనపై పోలీసులు 25 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణా అడ్డుకునే క్రమంలో సిబ్బందిపై దౌర్జన్యం చేసి, బిల్లింగ్ యంత్రం ధ్వంసం చేసి, మొబైల్ ఫోన్లు లాక్కున్నట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.