NLG: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ‘సర్వేజనా సుఖినోభవంతు’ అని ఆకాంక్షించారు.