KRNL: కృష్ణగిరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇవాళ 18వ విడత సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మోహన్ కుమార్ తెలిపారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి గత నెల 20 నుంచి ఈ నెల 15 వరకు తనిఖీ చేపట్టి గ్రామసభలు నిర్వహించడం జరిగిందన్నారు.