SKLM: జిల్లా వ్యవసాయాధికారిగా వై.వెంకట మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో డీడీగా పనిచేస్తున్నారు. గతంలో అమలాపురం, మచిలీపట్నం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.