KNR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకంను సద్వినియోగం చేసుకోవాలని, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో లబ్దిదారులకు రూ. 15 వేల విలువ గల కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా 18 రకాల కుల వృత్తుల వారికి శిక్షణతో, సర్టిఫికెట్, రుణం ఇస్తుందన్నారు.