AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై NCPవి రాజకీయ ఆరోపణలేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ‘అజిత్ పవార్ దుర్ఘటన బాధలో అలా మాట్లాడి ఉండొచ్చు. రామ్మోహన్ నిబద్ధతపై మాకు నమ్మకం ఉంది. ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే వ్యక్తి చంద్రబాబు. బాక్సైట్ అంశంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.