WGL: నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) హాల్లో హజ్ యాత్రికులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఎంజీఎం నుంచి ఆరుగురు జనరల్ ఫిజిషియన్లు, టెక్నిషియన్లు, జిల్లా ఆరోగ్య శాఖ నుంచి నలుగురు వైద్యులు పాల్గొని సేవలు అందించారు. మొత్తం 52 మందికి వైద్య పరీక్షలు, ఈసీజీ, ల్యాబ్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.