KMR: బాన్సువాడ మండలం హన్మాజీపేట్ అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం ఘటనలో పురోగతి లభించింది. వర్ని మండలం పైడిమల్ల గ్రామానికి చెందిన పాత్లావత్ జబ్బర్ను అధికారులు అరెస్టు చేశారు. చనిపోయిన చిరుత కళేబరం వద్ద చిరుత గోళ్లను కత్తిరించినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి నుంచి చిరుత పులి 10 గోళ్లును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.