BHNG: రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు అప్పుల బాధతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అయిటిపాముల పెద్దులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.