ELR: గణపవరం శ్రీ చింతలపాటి బాపిరాజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈనెల 23వ తేదీన నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతాయని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ కె నాగేశ్వరరావు శర్మ ఆదివారం తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్ధులు 377 మంది, వొకేషనల్ విద్యార్ధులు 34 మంది పరీక్షలకు హాజరవుతారన్నారు.