KMR: డ్వాక్రా సంఘాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై లింగంపేటలో మహిళా సంఘాల సభ్యులు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటాలకు మంగళవారం పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.