NZB: బాల్కొండ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా భీమల్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన, చెరువుల పూడికతీత, ఆయకట్టుకు నీరందకపోవడంపై చర్చకు తేవాలని పేర్కొంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర, పెట్టుబడి సాయం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.