NTR: మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రూ.1.08 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో మైలవరం పట్టణంలో మూడు చోట్ల నిర్మించనున్న మూడు వెల్ నెస్ సెంటర్ల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ. 36 లక్షలు చొప్పున వెచ్చించనున్నారు.