PLD: త్యాగానికి ప్రతీ రూపం అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు చౌట శ్రీనివాసరావు అన్నారు. సత్తనపల్లి గాంధీ చౌక్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.