VZM: చీపురుపల్లి మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు MEO బూసి నాయుడు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 7.45 నుంచి 12:30 వరకు తరగతులు నిర్వహించి, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. టెన్త్ పరిక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు.