HYD: గోల్కొండలోని రిసాలా బజార్లో దారుణం జరిగింది. 14 నెలల చిన్నారి ఉమ్మె అహ్మద్ను తన తల్లి గౌసియాబేగం దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఈ ఘాతుకానికి భర్తతో గొడవ, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు, స్థానికులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆస్పత్రికి తరలించిన చిన్నారి మృతి చెందగా, నిందుతురాలు పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.