WNP: పెబ్బేరు మండల పరిధిలోని తోమలపల్లి గ్రామ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి పునర్నిర్మాణం కోసం ఎమ్మెల్యే మేఘారెడ్డి తన సొంత నిధుల నుంచి రెండు లక్షల నగదును తన క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు. విరాళం అందజేసిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ కుమార్, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.