ATP: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆదేశాల మేరకు ఈ నెల 30న నిర్వహించే ఎస్సీ, ఎస్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ కోరారు. నార్పల మండలంలోని బి.పప్పూరు, గూగూడు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దళితులంతా ఏకమై శైలజానాథ్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.