NLG: దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో ‘ప్రజాప్రభుత్వం-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిలో వారి సేవలను గుర్తించి వారికి సబ్బులు, గ్లౌజులు, టోపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మాసారం అంబేద్కర్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.