NDL: బేతంచెర్ల మండలం ఆర్ఎస్.రంగాపురం గ్రామంలో పొలంలోని పైపులను పగలగొట్టిన ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఈడిగ పెద్ద మద్దిలేటి పొలంలోని పైపులను దండు మహమ్మద్, దండు మక్బూల్తో పాటు మరో ఐదుగురు కలిసి ధ్వంసం చేశారని ఎస్సై రమేష్ బాబు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.